మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- July 11, 2026
హైదరాబాద్: మల్కాజ్గిరిని మరింత సురక్షితమైన, పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పోలీస్, మున్సిపల్ శాఖల మధ్య కీలక సమన్వయ సమావేశం నిర్వహించారు. మల్కాజ్గిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ అధ్యక్షతన, మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి, ఐఏఎస్తో ఈ సమావేశం జరిగింది.
సమావేశంలో నగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడం, ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనడం, మహిళలు, చిన్నారుల భద్రతను మరింత పటిష్ఠం చేయడం, మాదకద్రవ్యాల నిర్మూలనకు సంయుక్త చర్యలు చేపట్టడం, సీసీటీవీ కెమెరాల విస్తరణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
పౌరుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యం ఇస్తూ పోలీస్, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. నగరంలో పరిశుభ్రత, ట్రాఫిక్ నిర్వహణ, నేరాల నివారణ, ప్రజా భద్రతకు సంబంధించిన కార్యక్రమాలను సంయుక్తంగా అమలు చేయడం ద్వారా మల్కాజ్గిరిని ఆదర్శవంతమైన నగరంగా అభివృద్ధి చేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు.
ప్రజల సహకారంతో భద్రత, పరిశుభ్రత, క్రమశిక్షణకు సంబంధించిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు శాఖలు కలిసి పనిచేయనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.
తాజా వార్తలు
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- ఫేక్ డిగ్రీతో టీచర్ ఉద్యోగం.. ప్రవాసికి 6 నెలల జైలుశిక్ష..!!
- లైసెన్స్ లేకుండా అకౌంటింగ్ సేవలు.. రెండు సంస్థలు, మాజీ అకౌంటెంట్పై చర్యలు..!!
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!







