ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- July 11, 2026
మస్కట్: ఒమాన్, భారత్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, లాజిస్టిక్స్, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో సహకారాన్ని విస్తరించడంతో పాటు ప్రాంతీయ సముద్ర భద్రత, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతున్న పరిణామాలపై ఇరు దేశాలు కీలకంగా చర్చించాయి. మస్కట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఒమాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైదీ, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలను సమీక్షించిన మంత్రులు, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే మార్గాలపై చర్చించారు. వ్యాపార సంస్థల మధ్య భాగస్వామ్యాన్ని పెంపొందించడం, నాణ్యమైన పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలను సాధించాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు, సముద్ర రవాణాపై ప్రభావం చూపుతున్న తాజా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలు, వాటి వల్ల ప్రపంచ వాణిజ్యం, ఇంధన సరఫరాలు, గ్లోబల్ సప్లై చైన్పై పడుతున్న ప్రభావాలపై కూడా ఇరు దేశాల మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు.
ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు అన్ని పక్షాలతో చర్చలు, సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, ప్రాంతీయ దేశాల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని నిర్ణయించాయి. ఈ సమావేశంలో ఒమన్, భారత ప్రభుత్వాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







