ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- July 11, 2026
కువైట్ సిటీ: కువైట్లోని ఫర్వానియా గవర్నరేట్లో ఓ ప్రైవేట్ నివాసాన్ని అక్రమంగా రెస్టారెంట్గా మార్చి నిర్వహిస్తున్న ఘటనపై అధికారులు దాడి నిర్వహించారు. పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ (PAFN) తన ఫర్వానియా తనిఖీ విభాగం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగంతో కలిసి ఈ దాడి చేపట్టింది. తనిఖీల్లో ఆ ఇంటిని ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా ఆహార తయారీ, విక్రయ కేంద్రంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆహార భద్రతా నిబంధనలు, ఇతర నియంత్రణ ప్రమాణాలకు సంబంధించిన పలు ఉల్లంఘనలు బయటపడటంతో సంబంధిత నిర్వాహకులపై పలువురు ఉల్లంఘన కేసులు నమోదు చేశారు.
నిందితులపై కువైట్లో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లుపబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వెల్లడించింది. ప్రజారోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించే లేదా ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించే సంస్థలపై తనిఖీలను మరింత ముమ్మరం చేసి, కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







