తిరుమల భక్తులకు గుడ్ న్యూస్

- April 07, 2026 , by Maagulf
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్

తిరుమల: ఏడుకొండల స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు రద్దీ సమయాల్లో 18 నుండి 24 గంటల పాటు క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సుదీర్ఘ నిరీక్షణ సమయంలో భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేందుకు టీటీడీ ‘వర్చువల్ రియాలిటీ’ (VR) టెక్నాలజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండే భక్తులకు వీఆర్ హెడ్‌సెట్ల ద్వారా తిరుమల క్షేత్ర విశేషాలను, శ్రీవారి నిత్య కల్యాణ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్‌లలోని కంపార్ట్‌మెంట్లలో భక్తుల కోసం టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ, రద్దీ మరియు కోలాహలం కారణంగా వాటి శబ్దం సరిగ్గా వినపడటం లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా వీఆర్ టెక్నాలజీని టీటీడీ ఎంచుకుంది. ఈ పరికరాల ద్వారా భక్తులు ఏకాంతంగా, ప్రశాంతంగా ఆధ్యాత్మిక దృశ్యాలను వీక్షించవచ్చు. ఈ ప్రాజెక్టును విరాళాల (Donation Basis) రూపంలో చేపట్టాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం నాణ్యమైన వీఆర్ పరికరాల ఎంపికపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే భక్తులకు నిరీక్షణ సమయం కూడా ఒక మధుర జ్ఞాపకంలా మారుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com