AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం
- July 11, 2026
విజయవాడ: ఎ.పి ఫిలిం ఛాంబర్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం శుక్రవారం నాడు సీతారాంపురం సిగ్నల్స్ సమీపంలోని యాపిల్ డైయాగ్నోసిస్ నందు జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉపాధ్యక్షులు డా|| మిక్కిలి ప్రసన్న కుమార్ వర్మ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు మేకప్ నందు విశేష అనుభవం గడించిన తనూజ నియామకం వలన ఛాంబర్ మరింత పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని ప్రశంసించారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా ఆద్వర్యం లో ఈ నియామక పత్రాన్ని అందచేసి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎ.పి ఫిలిం ఛాంబర్ మేకోవర్ చైర్ పర్సన్ మేరుగు తనూజ మాట్లాడుతూ నన్ను ఈ పదవికి ఎంపిక చేసినందుకు అధ్యక్షులు మంథా శ్రీనివాస్ మరియు జనరల్ సెక్రటరీ చైతన్య జంగా వారికి కృతజ్ఞతలు తెలియ చేశారు. అనంతరం జనరల్ సెక్రటరీ చైతన్య జంగా మాట్లాడుతూ త్వరలో మహిళలకు ఉపాధి కల్పించే దిశలో తనూజ ఆధ్వర్యం లో శిక్షణ తరగతులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలియ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎ.పి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమ వివరాలను, ప్రణాళికలను త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎల్. రాధా రాజేశ్వరి, సభ్యులు ఆర్. వి. అప్పా రావు, ఎమ్. ఈశ్వర రావు, డా|| చిలకపాటి రామ్ చంద్ మరియు తదితర సభ్యులు పాల్గొని తనూజ కి అభినందనలు అందచేశారు.

తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







