ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- April 07, 2026
టెహ్రాన్: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు ఎవరెక్కడ ఉన్నారో అక్కడే సురక్షితంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు రావద్దని స్పష్టంగా సూచించింది.
భారతీయులు తమ నివాసాల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారు పై అంతస్తుల్లో కాకుండా దిగువ అంతస్తుల్లో ఉండాలని సూచించింది. అలాగే విద్యుత్ కేంద్రాలు, మిలిటరీ స్థావరాలు మరియు ఇతర సున్నిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.
ఇరాన్లోని భారత రాయబార కార్యాలయ పరిధిలో ఉన్న హోటళ్లలో తాత్కాలికంగా ఉంటున్న భారతీయులు కూడా హోటల్ గదుల నుంచే బయటకు రావద్దని సూచనలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు ఎంబసీ అధికారులతో, సహాయక బృందాలతో సంప్రదింపుల్లో ఉండాలని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని తెలిపింది. ఈ మేరకు టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం కీలక భద్రతా సూచనలు విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, గల్ఫ్ ఉద్రిక్తతల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. “ఇరాన్ నాగరికతను అంతం చేస్తాం” అన్న ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ, తమ దేశ చరిత్ర, సంస్కృతి కాలానికి ఎదురొడ్డి నిలిచిందని ఇరాన్ పేర్కొంది. ఇలాంటి హెచ్చరికలు తమపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది.
తాజా పరిణామాల దృష్ట్యా ఇరాన్లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, రాయబార కార్యాలయం సూచనలను కచ్చితంగా పాటించాలని అధికారులు పునరుద్ఘాటించారు.
⚠️ Advisory as on 07 April 2026. pic.twitter.com/xsrpoOvx0f
— India in Iran (@India_in_Iran) April 7, 2026
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







