10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- April 07, 2026
న్యూ ఢిల్లీ: పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం విమాన రవాణాపైనా పడింది. భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 10 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు అయినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
భారీగా తగ్గిన విమాన సర్వీసులు
సాధారణంగా భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీసులు నడిచేవి. అయితే ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆ సంఖ్య 80 నుంచి 90 సర్వీసులకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా సుదూర విమాన ప్రయాణాల నేపథ్యంలో పైలట్ల ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ నిబంధనలను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









