10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- April 07, 2026
న్యూ ఢిల్లీ: పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం విమాన రవాణాపైనా పడింది. భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 10 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు అయినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
భారీగా తగ్గిన విమాన సర్వీసులు
సాధారణంగా భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీసులు నడిచేవి. అయితే ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆ సంఖ్య 80 నుంచి 90 సర్వీసులకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా సుదూర విమాన ప్రయాణాల నేపథ్యంలో పైలట్ల ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ నిబంధనలను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







