10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- April 07, 2026
న్యూ ఢిల్లీ: పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం విమాన రవాణాపైనా పడింది. భారత్ నుంచి ఆ ప్రాంతానికి వెళ్లే విమాన సర్వీసులు పెద్ద ఎత్తున రద్దయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం 10 వేలకుపైగా విమాన సర్వీసులు రద్దు అయినట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది.
భారీగా తగ్గిన విమాన సర్వీసులు
సాధారణంగా భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకు రోజుకు 300 నుంచి 350 వరకు విమాన సర్వీసులు నడిచేవి. అయితే ప్రస్తుతం యుద్ధ ఉద్రిక్తతల కారణంగా ఆ సంఖ్య 80 నుంచి 90 సర్వీసులకు పడిపోయినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా సుదూర విమాన ప్రయాణాల నేపథ్యంలో పైలట్ల ‘ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్’ నిబంధనలను డీజీసీఏ తాత్కాలికంగా సడలించింది. విమాన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









