KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- April 08, 2026
కువైట్ః నగదు లావాదేవీలకు సంబంధించిన కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అనేక సేవా రంగాలలో 10 కువైట్ దినార్లకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఒసామా బూడాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. నగదు స్థానంలో బ్యాంకింగ్ లేదా ఆమోదించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలని ఆదేశించారు.
"2026 నాటి మంత్రిత్వ శాఖ నిర్ణయం నెం. 32 ప్రకారం.. ఆరోగ్య సంస్థలు, పురుషుల మరియు మహిళల సెలూన్లు, పిల్లల సెలూన్లు, స్పోర్ట్స్ క్లబ్లు, కీటకాలు మరియు ఎలుకల నియంత్రణ సేవలు, అలాగే ప్రజారోగ్య పురుగుమందుల దిగుమతి, ఎగుమతి మరియు నిల్వలో నిమగ్నమైన వ్యాపారాలకు వర్తిస్తుంది." అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా ఉత్తర్వుల్లోని ఆర్టికల్ 1 ప్రకారం.. కాంట్రాక్టులు, అమ్మకాలు లేదా సేవల కోసం 10 కువైట్ దినార్లకు మించిన నగదు చెల్లింపులను నిషేధిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ పరిమితిని మించిన ఏదైనా మొత్తాన్ని, వర్తించే నిబంధనలకు అనుగుణంగా కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థల ద్వారానే ప్రాసెస్ చేయాలి.
ఆర్టికల్ 2, 1979 నాటి చట్టం నెం. 10 .. ఉల్లంఘనలకు విధించే జరిమానాలను నిర్దేశిస్తుంది. వీటిలో, తప్పు చేసిన సంస్థను మూసివేయడం మరియు చట్టపరమైన చర్యల కోసం రిఫర్ చేయడం వంటివి ఉంటాయి.ఈ కొత్త నిబంధన, అధికారిక గెజెట్లో ప్రచురించిన నాటి నుంచి వెంటనే అమల్లోకి వస్తుందన్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







