KD10 మించిన నగదు లావాదేవీల పై నిషేధం..!!
- April 08, 2026
కువైట్ః నగదు లావాదేవీలకు సంబంధించిన కువైట్ సంచలన నిర్ణయం తీసుకుంది. అనేక సేవా రంగాలలో 10 కువైట్ దినార్లకు మించిన నగదు లావాదేవీలను నిషేధిస్తూ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి ఒసామా బూడాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. నగదు స్థానంలో బ్యాంకింగ్ లేదా ఆమోదించిన ఎలక్ట్రానిక్ చెల్లింపు పద్ధతులను ఉపయోగించాలని ఆదేశించారు.
"2026 నాటి మంత్రిత్వ శాఖ నిర్ణయం నెం. 32 ప్రకారం.. ఆరోగ్య సంస్థలు, పురుషుల మరియు మహిళల సెలూన్లు, పిల్లల సెలూన్లు, స్పోర్ట్స్ క్లబ్లు, కీటకాలు మరియు ఎలుకల నియంత్రణ సేవలు, అలాగే ప్రజారోగ్య పురుగుమందుల దిగుమతి, ఎగుమతి మరియు నిల్వలో నిమగ్నమైన వ్యాపారాలకు వర్తిస్తుంది." అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా ఉత్తర్వుల్లోని ఆర్టికల్ 1 ప్రకారం.. కాంట్రాక్టులు, అమ్మకాలు లేదా సేవల కోసం 10 కువైట్ దినార్లకు మించిన నగదు చెల్లింపులను నిషేధిస్తుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ పరిమితిని మించిన ఏదైనా మొత్తాన్ని, వర్తించే నిబంధనలకు అనుగుణంగా కువైట్ సెంట్రల్ బ్యాంక్ ఆమోదించిన బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్థల ద్వారానే ప్రాసెస్ చేయాలి.
ఆర్టికల్ 2, 1979 నాటి చట్టం నెం. 10 .. ఉల్లంఘనలకు విధించే జరిమానాలను నిర్దేశిస్తుంది. వీటిలో, తప్పు చేసిన సంస్థను మూసివేయడం మరియు చట్టపరమైన చర్యల కోసం రిఫర్ చేయడం వంటివి ఉంటాయి.ఈ కొత్త నిబంధన, అధికారిక గెజెట్లో ప్రచురించిన నాటి నుంచి వెంటనే అమల్లోకి వస్తుందన్నారు.
తాజా వార్తలు
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!









