తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- April 09, 2026
చెన్నై: ఎన్నికల కమిషన్ (EC) ఆదేశాల మేరకు తమిళనాడు ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందంను బదిలీ చేశారు.ఆయన స్థానంలో తమిళనాడు క్యాడర్ ఏపీకి చెందిన సీనియర్ అధికారి ఎం.సాయి కుమార్ ను రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఎం.సాయి కుమార్ అదే సాయంత్రం చెన్నై సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఈ మార్పు ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన పరిపాలనా మార్పులలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాయి కుమార్, ఎన్నికల నిర్వహణతో పాటు ప్రభుత్వ యంత్రాంగ సమన్వయంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు సాధారణమే అయినప్పటికీ, ప్రధాన కార్యదర్శి స్థాయిలో జరిగిన ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









