తమిళనాడు ప్రధాన కార్యదర్శిగా ఎం.సాయి కుమార్ బాధ్యతలు స్వీకారం
- April 09, 2026
చెన్నై: ఎన్నికల కమిషన్ (EC) ఆదేశాల మేరకు తమిళనాడు ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందంను బదిలీ చేశారు.ఆయన స్థానంలో తమిళనాడు క్యాడర్ ఏపీకి చెందిన సీనియర్ అధికారి ఎం.సాయి కుమార్ ను రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఎం.సాయి కుమార్ అదే సాయంత్రం చెన్నై సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఈ మార్పు ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన పరిపాలనా మార్పులలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాయి కుమార్, ఎన్నికల నిర్వహణతో పాటు ప్రభుత్వ యంత్రాంగ సమన్వయంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు సాధారణమే అయినప్పటికీ, ప్రధాన కార్యదర్శి స్థాయిలో జరిగిన ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







