అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- April 10, 2026
యూఏఈ: అబుదాబిలోని అల్ ఐన్ నగరంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఫుల్ కోహ్లీ రెస్టారెంట్లో తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలను గుర్తించారు. దానిని వెంటనే మూసివేయాలని అబుదాబి అధికారులు నోటీసులు జారీ చేశారు.
అబుదాబి వ్యవసాయ మరియు ఆహార భద్రతా అథారిటీ (అదాఫ్సా) ప్రకారం.. ఈ సంస్థ "ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు" కలిగించింది. పదేపదే ఉల్లంఘనలు జరగడం, దిద్దుబాటు చర్యలను అమలు చేయడంలో సంస్థ విఫలమవడం వల్ల ఈ మూసివేత ఉత్తర్వులు జారీ చేసినట్లు అథారిటీ తెలిపింది.
ఏప్రిల్ 3న ఇదే ఆరోపణలపై జాయెద్ ది ఫస్ట్ స్ట్రీట్లోని అమీనా రెస్టారెంట్ను కూడా తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నోటీసులు జారీచేశారు.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









