డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- April 10, 2026
కువైట్: దేశంలోని పలు కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని, గురువారం సాయంత్రం ఇరాన్ మరియు దాని అనుబంధ సంస్థలు జరిపిన డ్రోన్ దాడులను కువైట్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ దాడులు కువైట్ సార్వభౌమాధికారం మరియు గగనతలాన్ని దారుణంగా ఉల్లంఘించడమే కాకుండా అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టం, ఐక్యరాజ్యసమితి చార్టర్ను కూడా స్పష్టంగా ఉల్లంఘించాయని మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది.
కువైట్ మరియు ఈ ప్రాంతంలోని ఇతర దేశాల పై ఇరాన్, దాని అనుబంధ సంస్థలు కొనసాగిస్తున్న శత్రుపూరిత చర్యలు, అమెరికా, ఇరాన్ మధ్య ప్రకటించిన కాల్పుల విరమణతో సహా ఇటీవలి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ సమాజానికి ప్రత్యక్ష సవాలుగా ఉన్నాయని అది పేర్కొంది.
కువైట్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మరియు దాని అనుబంధ సంస్థలు చేపడుతున్న అన్ని శత్రుపూరిత చర్యలను తక్షణమే, బేషరతుగా నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం తనకు సహజంగా ఉన్న ఆత్మరక్షణ హక్కుకు కువైట్ కట్టుబడి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







