‘జయహో జనార్ధన’ పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది..

- April 10, 2026 , by Maagulf
‘జయహో జనార్ధన’ పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది..

పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా తెరకెక్కిస్తున్న సినిమా ‘జయహో జనార్ధన’. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని డైరెక్టర్ సంపత్ నంది లాంచ్ చేసారు. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి తెలిపారు. పోస్టర్ లాంచ్ అనంతరం సంపత్ నంది.. నిర్మాత, దర్శకుడిని అభినందించి సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com