‘జయహో జనార్ధన’ పోస్టర్ లాంచ్ చేసిన సంపత్ నంది..
- April 10, 2026
పానుగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై పానుగంటి శరత్ రెడ్డి నిర్మాతగా దర్శకుడుగా తెరకెక్కిస్తున్న సినిమా ‘జయహో జనార్ధన’. నరేష్ వాసం, రమ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా ఈ సినిమాలో 30 ఇయర్స్ పృథ్వీ, రోలర్ రఘు, చలాకి చంటి, మైమ్ మధు, దయానంద రెడ్డి, జబర్దస్త్ రాఘవ, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ రాజమౌళి, పటాస్ ప్రవీణ్, నెమలి రాజు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ని డైరెక్టర్ సంపత్ నంది లాంచ్ చేసారు. లవ్ కమర్షియల్ కామెడీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు నిర్మాత, దర్శకుడు పానుగంటి శరత్ రెడ్డి తెలిపారు. పోస్టర్ లాంచ్ అనంతరం సంపత్ నంది.. నిర్మాత, దర్శకుడిని అభినందించి సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









