26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం

- April 10, 2026 , by Maagulf
26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం

న్యూ ఢిల్లీ:  రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన భారతీయులు అక్కడ ఏజెంట్ల ద్వారా మోసపోయి యుద్ధంలో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

బాధితుల కుటుంబ సభ్యుల ప్రకారం, రష్యా సైన్యంలో ఈ భారతీయులను బలవంతంగా చేర్చినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు యువకులు యుద్ధంలో గాయపడగా, మరికొందరు నిర్బంధంలో ఉన్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

పిటిషినర్ తరఫు న్యాయవాది ఈ విషయాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com