26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- April 10, 2026
న్యూ ఢిల్లీ: రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన భారతీయులు అక్కడ ఏజెంట్ల ద్వారా మోసపోయి యుద్ధంలో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితుల కుటుంబ సభ్యుల ప్రకారం, రష్యా సైన్యంలో ఈ భారతీయులను బలవంతంగా చేర్చినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు యువకులు యుద్ధంలో గాయపడగా, మరికొందరు నిర్బంధంలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పిటిషినర్ తరఫు న్యాయవాది ఈ విషయాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్







