26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- April 10, 2026
న్యూ ఢిల్లీ: రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన భారతీయులు అక్కడ ఏజెంట్ల ద్వారా మోసపోయి యుద్ధంలో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితుల కుటుంబ సభ్యుల ప్రకారం, రష్యా సైన్యంలో ఈ భారతీయులను బలవంతంగా చేర్చినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు యువకులు యుద్ధంలో గాయపడగా, మరికొందరు నిర్బంధంలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పిటిషినర్ తరఫు న్యాయవాది ఈ విషయాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







