26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- April 10, 2026
న్యూ ఢిల్లీ: రష్యాలో చిక్కుకున్న 26 మంది భారతీయులను స్వదేశానికి రప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన భారతీయులు అక్కడ ఏజెంట్ల ద్వారా మోసపోయి యుద్ధంలో చిక్కుకున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధితుల కుటుంబ సభ్యుల ప్రకారం, రష్యా సైన్యంలో ఈ భారతీయులను బలవంతంగా చేర్చినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు యువకులు యుద్ధంలో గాయపడగా, మరికొందరు నిర్బంధంలో ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పిటిషినర్ తరఫు న్యాయవాది ఈ విషయాలను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనానికి వివరించారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









