ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- April 11, 2026
హైదరాబాద్: తన పై వస్తున్న ఆరోపణల పట్ల దర్శకుడు వేణు ఉడుగుల ఎట్టకేలకు స్పందిస్తూ, వాస్తవాలను వెల్లడించారు. గాయని మంగ్లీకి సంబంధించిన వివాదంలో తన పేరును అనవసరంగా లాగడం పై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారాల వల్ల తాను, తన కుటుంబ సభ్యులు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం పరిచయస్తుల మధ్య వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోమని మాత్రమే సూచించానని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలో చట్టపరంగా తన ప్రమేయం లేదని వేణు ఉడుగుల వివరించారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎక్కడా తన పేరు లేదని, ప్రాథమిక విచారణలో పంజాగుట్ట పోలీసులు సైతం తనకు క్లీన్ చిట్ ఇచ్చారని గుర్తు చేశారు. అంతే కాకుండా, ఈ కేసులో ఫిర్యాదు దారుడైన అడ్వకేట్ సుబ్బారావు కూడా స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారంలో తన తప్పు ఏమీ లేదని స్పష్టతనిచ్చిన వీడియోలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఇలాంటి ఆధారాలు ఉన్నప్పటికీ తనను నిందితుడిగా చిత్రీకరించడం బాధాకరమని పేర్కొన్నారు. నైతిక విలువలతో కూడిన పాత్రికేయ విలువల గురించి వివరిస్తూ, ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే కథనాలను ప్రసారం చేసే ముందు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవాస్తవాలను ప్రచారం చేయడం వల్ల కలిగే నష్టం ఎప్పటికీ పూడ్చలేనిదని, అభిమానుల ప్రేమే తనకు కొండంత అండ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇకనైనా తప్పుడు వార్తలకు ముగింపు పలకాలని కోరుతూ, నిజనిజాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









