కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- April 11, 2026
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ ప్లయాస్ ట్యాంకర్ లారీ బోల్తా పడడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి హైదరాబాద్కు చెందిన ఏపీ, తెలంగాణ హైకోర్టుల సీనియర్ లాయర్ బొద్దులూరి శ్రీనివాసరావుగా గుర్తించారు. ఆయన హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడ మారుతీ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు టోల్ చెల్లించేందుకు కీసర టోల్ ప్లాజా వద్ద ఆగింది. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో వేగంగా వచ్చి అక్కడ నిలిపి ఉన్న కారుపై బోల్తా పడింది.
16 చక్రాల భారీ ట్యాంకర్ కారుపై పడటంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. టోల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన కారు బీఎండబ్ల్యూ (TS 6662). మొదట కారులో ముగ్గురు ఉన్నారని ప్రచారం జరిగినా, తరువాత అందులో శ్రీనివాసరావు ఒక్కరే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్









