పిల్లి నేపథ్యంలో సినిమా...
- August 04, 2016
కోలీవుడ్లో శునకాలకు సంబంధించి చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఏనుగు, పాముల నేపథ్యంలోనూ తీశారు. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఈగ' చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ వరుసలో పిల్లి కూడా ఉన్నప్పటికీ... ఒకట్రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేశారు మన దర్శకులు. ఇప్పుడు పిల్లి ప్రధాన పాత్రలో తమిళంలో పూర్తిస్థాయి చిత్రం తెరకెక్కుతోంది. చిన్నాస్ పళనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి 'మియావ్' అని పేరు పెట్టారు. గ్లోబల్ ఉడ్స్ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ.. '' ఇప్పటివరకు వందకుపైగా ప్రకటనలను రూపొందించా. చాలా కాలంగా పిల్లి నేపథ్యంలో సినిమాను తెరకెక్కించాలని అనుకున్నా. ఇప్పటికి ఆ కోరిక నెరవేరింది. మా కథ కోసం నాగపూర్ నుంచి ఓ పిల్లిని తీసుకొచ్చి నటింపజేశాం. సాధారణంగా దాన్ని అందరూ అపశకునంగా భావిస్తారు. ఈ సినిమాతో పిల్లి అంటే ఇష్టం పెరుగుతుంది. ఇందులో దానికి రెండు పాటలు కూడా ఉన్నాయి. చిత్రీకరణ 34 రోజుల్లో పూర్తి చేశాం. గ్రాఫిక్ పనులకు దాదాపు ఆరు నెలలు పట్టింది. ఇందులో పిల్లికి సెల్ఫీ అని పేరు పెట్టాం. కామెడీ అద్భుతంగా పండింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు కూడా పూర్తయ్యాయి. సెప్టెంబరులో సినిమాను తెరపైకి తీసుకొస్తామ''ని పేర్కొన్నారు. ఇటీవలే ట్రైలర్, ఫస్ట్లుక్ను ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









