ఆన్‌లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!

- April 13, 2026 , by Maagulf
ఆన్‌లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!

మనామాః రెండవ టర్మ్ ముగిసే వరకు బోధన మరియు పరీక్షలను కొనసాగించాలని విద్యా మంత్రిత్వ శాఖ నిర్ణయించడంతో.. బహ్రెయిన్‌లోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులను కొనసాగించడం లేదా తరగతి గదులకు తిరిగి రావడాన్ని ఎంచుకోవచ్చు.  ప్రభుత్వ పాఠశాలల్లో 1వ సంవత్సరం నుండి 12వ సంవత్సరం వరకు ఉన్న విద్యార్థులందరికీ వచ్చే ఆదివారం నుండి రెండు ఎంపికలు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ మంత్రి డాక్టర్ మహమ్మద్ బిన్ ముబారక్ జుమా తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపారు. మరోవైపు, ప్రైవేట్ పాఠశాలలు తమ సొంత బోధన మరియు పరీక్షల ప్రణాళికలను నిర్ణయించుకోవడానికి స్వేచ్ఛ ఉంటుందన్నారు.  

పాఠశాలకు తిరిగి వచ్చే విద్యార్థులు క్యాంపస్‌లో లేదా రిమోట్ లెర్నింగ్ ద్వారా పరీక్షలు రాయవచ్చు అని తెలిపారు.  అదేవిధంగా, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు  విద్యాపరమైన పర్యవేక్షణ కారణంగా, వారికి సేవలందించే ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను కూడా తిరిగి తెరవడానికి అనుమతించినట్టు పేర్కొన్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com