టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- April 13, 2026
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ పై యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఇరాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ముఖ్యంగా పౌరులకు వైద్యం అందించే ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేయడం అమానుషమని పేర్కొంది.
టెహ్రాన్లోని గాంధీ ఆసుపత్రి భవనం వైమానిక దాడుల్లో ధ్వంసమైన దృశ్యాలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. శిథిలమైన వార్డులు, కాలిపోయిన వైద్య పరికరాలు, భవనాలకు జరిగిన నష్టాన్ని చూపిస్తూ, అసహాయ స్థితిలో ఉన్న రోగులపై బాంబులు వేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ మండిపడింది. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 600 లకు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమయ్యాయని, పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను, సైనిక కార్యకలాపాలను ఆసుపత్రులు, పాఠశాలల కింద ఉన్న భూగర్భ బంకర్ల నుంచి నిర్వహిస్తోందని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించింది.
తాజా వార్తలు
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
- 'మార్గం మార్చుకోండి, వెనక్కి వెళ్ళండి': అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
- ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- హోర్ముజ్ జలసంధిని అందరికీ తెరవాలని ఆస్ట్రేలియా పిలుపు
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్ కాల్తో శాంతి చర్చలు భంగం
- అడ్మిషన్ల ప్రక్రియలో ఖతార్ మార్పులు..!!
- ఫిబ్రవరిలో SR 12.5 బిలియన్లకు తగ్గిన రెమిటెన్స్..!!
- అనుమతి రాగానే T5 కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాం..జజీరా ఎయిర్వేస్
- ఆన్లైన్ లేదా తరగతి గది బోధన..ఛాయిస్ మీదే..!!









