టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- April 13, 2026
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ పై యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఇరాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ముఖ్యంగా పౌరులకు వైద్యం అందించే ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేయడం అమానుషమని పేర్కొంది.
టెహ్రాన్లోని గాంధీ ఆసుపత్రి భవనం వైమానిక దాడుల్లో ధ్వంసమైన దృశ్యాలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. శిథిలమైన వార్డులు, కాలిపోయిన వైద్య పరికరాలు, భవనాలకు జరిగిన నష్టాన్ని చూపిస్తూ, అసహాయ స్థితిలో ఉన్న రోగులపై బాంబులు వేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ మండిపడింది. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 600 లకు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమయ్యాయని, పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను, సైనిక కార్యకలాపాలను ఆసుపత్రులు, పాఠశాలల కింద ఉన్న భూగర్భ బంకర్ల నుంచి నిర్వహిస్తోందని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించింది.
తాజా వార్తలు
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!









