టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- April 13, 2026
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ పై యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఇరాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ముఖ్యంగా పౌరులకు వైద్యం అందించే ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేయడం అమానుషమని పేర్కొంది.
టెహ్రాన్లోని గాంధీ ఆసుపత్రి భవనం వైమానిక దాడుల్లో ధ్వంసమైన దృశ్యాలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. శిథిలమైన వార్డులు, కాలిపోయిన వైద్య పరికరాలు, భవనాలకు జరిగిన నష్టాన్ని చూపిస్తూ, అసహాయ స్థితిలో ఉన్న రోగులపై బాంబులు వేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ మండిపడింది. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 600 లకు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమయ్యాయని, పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను, సైనిక కార్యకలాపాలను ఆసుపత్రులు, పాఠశాలల కింద ఉన్న భూగర్భ బంకర్ల నుంచి నిర్వహిస్తోందని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







