టెహ్రాన్లో గాంధీ ఆసుపత్రి ధ్వంసం!
- April 13, 2026
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు తమ పై యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఇరాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.ముఖ్యంగా పౌరులకు వైద్యం అందించే ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేయడం అమానుషమని పేర్కొంది.
టెహ్రాన్లోని గాంధీ ఆసుపత్రి భవనం వైమానిక దాడుల్లో ధ్వంసమైన దృశ్యాలను ఇరాన్ మీడియా విడుదల చేసింది. శిథిలమైన వార్డులు, కాలిపోయిన వైద్య పరికరాలు, భవనాలకు జరిగిన నష్టాన్ని చూపిస్తూ, అసహాయ స్థితిలో ఉన్న రోగులపై బాంబులు వేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఇరాన్ మండిపడింది. ఈ దాడుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 600 లకు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమయ్యాయని, పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోపించింది.
అయితే, ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను, సైనిక కార్యకలాపాలను ఆసుపత్రులు, పాఠశాలల కింద ఉన్న భూగర్భ బంకర్ల నుంచి నిర్వహిస్తోందని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







