ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు
- April 13, 2026
ఉపదేశామృత తరంగిణి పుస్తకాన్ని ఆవిష్కరించిన పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు*
చెన్నై: పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువు, స్వర్గీయ పోలూరి హనుమజ్జానకీరామ శర్మ కర్తృత్వంలో రూపొందిన ఉపదేశామృత తరంగిణి పునర్ముద్రణను చెన్నైలోని లోక్ భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి గురువు స్మృతికి పూర్వ ఉపరాష్ట్రపతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సంస్కృత పండితులు పూర్ణానంద శాస్త్రి తో పాటు పుస్తక సంపాదకులు తుమాటి సంజీవరావు, పోలూరి హనుమజ్జానకీరామ శర్మ కుటుంబ సభ్యులు తదితరులు హాజరయ్యారు.
కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ప్రథమ పీఠాధిపతులు విమలానంద భారతి వారి ఉపన్యాసాలను పోలూరి హనుమజ్జానకీరామ శర్మ సాధారణ ప్రజల కోసం పుస్తకం రూపంలో తీసుకొచ్చారు. ఏటా వారి జయంతిని పురస్కరించుకుని, వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ స్మారక ట్రస్ట్ ద్వారా వారి సాహిత్యాన్ని పునర్ముద్రిస్తున్నారు. చెన్నపురి తెలుగు అకాడెమి వ్యవస్థాపక అధ్యక్షులు తూమాటి సంజీవరావు సంపాదకత్వంలో పునర్ముద్రించిన ఈ పుస్తకాన్ని, ఈరోజు చెన్నై లోక్ భవన్ లో ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చొరవ తీసుకుని ఈ పుస్తకాన్ని ఆకర్షణీయంగా పునర్ముద్రించిన వారి కుటుంబ సభ్యులకు, సంపాదకత్వ బాధ్యతలు వహించిన తూమాటి సంజీవరావుకి పూర్వ ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు.ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సామాన్యులకు సైతం అర్థం అయ్యే విధంగా ఉపదేశామృత తరంగిణి పుస్తకానికి వారు రూపకల్పన చేసిన తీరు మహోన్నతమైనదన్న వెంకయ్యనాయుడు,పోలూరి హనుమజ్జానకీ రామ శర్మ నైపుణ్యం, అనుభవం, ఆధ్యాత్మిక మార్గంలో వారి వైశిష్ట్యానికి ఈ పుస్తకం చక్కని ఉదాహరణ అని పేర్కొన్నారు.ముఖ్యంగా యువతరానికి ఈ పుస్తకాన్ని చేరువ చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







