'కబాలి' సినిమా ఫైట్ మాస్టర్స్ మహేష్ సినిమా కి ..
- August 05, 2016
'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ తో నిరాశగా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబుకు మరో డిజాస్టర్ మూవీ 'కబాలి' కి పనిచేసిన కొంత మంది పనిచేయడం హాట్ న్యూస్ గా మారింది. మురుగదాస్ దర్శకత్యంలో లేటెస్ట్ గా మహేష్ నటిస్తున్న సినిమాకు 'కబాలి' సినిమాకు సంబంధించి ఇద్దరు టెక్నీషియన్లను తీసుకున్నారు.టాలీవుడ్ లో రామ్, లక్ష్మణ్ బ్రదర్స్ మాదిరిగా కోలీవుడ్ లో అన్బు, అరసు అనే ఇద్దరు ఫైట్ మాస్టర్లు ఉన్నారు. వాళ్లిద్దరూ కూడా కవల సోదరులే ప్రస్తుతం కోలీవుడ్ సినిమా రంగంలో వీరిద్దరూ బెస్ట్ ఫైట్ మాస్టర్స్ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలి' సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసింది కూడా ఈ ఫైట్ మాస్టర్స్ అన్న విషయం చాలమందికి తెలియదు.
ప్రస్తుతం ఈ ట్విన్ బ్రదర్స్ మహేష్ మురుగ సినిమాకు యాక్షన్ డిజైన్ చేస్తున్నారు. కొన్ని రోజుల కిందటే షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో నైట్ ఎఫెక్టులో కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు మురగదాస్ చిత్రీకరిస్తున్నాడు అన్బు- అరసు ఈసినిమా కోసం స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసాడని వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా కోసం మహేష్ మంచి క్లాసు లుక్ లో తయారు అయ్యాడు. ప్రస్తుతం ఆ లుక్ లోనే మహేష్ ఫైట్ లు చేస్తున్నాడు. మహేష్ సినిమాల్లో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఈ ఫైట్లు ఉంటాయని మురగదాస్ మీడియాకు లీక్ లు ఇస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న పదిరోజుల షెడ్యూల్ పూర్తయ్యాక ఈచిత్ర యూనిట్ పుణె ముంబాయి నగరాలకు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్ళబోతోంది. ఆ తరువాత ఈసినిమా భారీ షెడ్యూల్ గుజరాత్ లో ప్లాన్ చేస్తున్నారు. సుమారు 100 కోట్ల భారీబడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ మొట్టమదటి సారి మహేష్ పక్కన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం పై మహేష్ నెంబర్ వన్ స్థానం ఆధారపడి ఉంది అన్నది ఓపెన్ సీక్రెట్..
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









