ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
- August 05, 2016
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మెదక్జిల్లా కోమటిబండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7న ప్రధాని చేతుల మీదుగా 5 శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రధాని కూర్చునే వేదికపై 18మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలో 2లక్షల మంది కూర్చునేలా, వాహనాల పార్కింగ్ కోసం 4 అప్రోచ్రోడ్లు, సుమారు 200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









