ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
- August 05, 2016
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మెదక్జిల్లా కోమటిబండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7న ప్రధాని చేతుల మీదుగా 5 శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రధాని కూర్చునే వేదికపై 18మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలో 2లక్షల మంది కూర్చునేలా, వాహనాల పార్కింగ్ కోసం 4 అప్రోచ్రోడ్లు, సుమారు 200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









