ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి...
- August 05, 2016
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. మెదక్జిల్లా కోమటిబండలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 7న ప్రధాని చేతుల మీదుగా 5 శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయని వివరించారు. ప్రధాని కూర్చునే వేదికపై 18మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశామన్నారు. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభలో 2లక్షల మంది కూర్చునేలా, వాహనాల పార్కింగ్ కోసం 4 అప్రోచ్రోడ్లు, సుమారు 200 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







