కతారాలో ఎలైట్ ఎగ్జిబిషన్ 2026 ప్రారంభం..!!
- April 14, 2026
దోహా: కతారాలోని ఖతారీ అసోసియేషన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ ప్రధాన కార్యాలయంలోని బిల్డింగ్ 13లో ఎలైట్ ఎగ్జిబిషన్ 2026ను కల్చరల్ విలేజ్ (కతారా) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీం అల్-సులైతి అధికారికంగా ప్రారంభించారు.
ఇది సందర్శకుల కోసం ప్రముఖ ఖతారీ కళాకారుల కళాఖండాలను ఒకచోట చేర్చింది. ఈ సందర్భంగా విజిటర్స్, అతిథులు ప్రదర్శనలో ఉన్న కళాఖండాలను చూసి, వాటి ప్రత్యేకతల గురించి కళాకారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రీన్, రెడ్ మరియు ఎల్లో కలర్స్ లో విలక్షణమైన రేఖాగణిత మోడల్స్ తో కూడిన అద్భుతమైన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్లు ఈ ప్రదర్శనలోని హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇలాంటి అనేక ఖతారీ వారసత్వ కళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
డాక్టర్ అల్-సులైతి ఉన్నతాధికారులతో కలిసి ప్రదర్శనను తిలకించారు. ఖతార్ ప్రధాన సాంస్కృతిక గమ్యస్థానంగా కతారా కల్చరల్ విలేజ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉందని పేర్కొన్నారు. ఇది ఖతారీ అసోసియేషన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ కు ఒక శాశ్వత వేదికను అందిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









