కతారాలో ఎలైట్ ఎగ్జిబిషన్ 2026 ప్రారంభం..!!
- April 14, 2026
దోహా: కతారాలోని ఖతారీ అసోసియేషన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ ప్రధాన కార్యాలయంలోని బిల్డింగ్ 13లో ఎలైట్ ఎగ్జిబిషన్ 2026ను కల్చరల్ విలేజ్ (కతారా) డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీం అల్-సులైతి అధికారికంగా ప్రారంభించారు.
ఇది సందర్శకుల కోసం ప్రముఖ ఖతారీ కళాకారుల కళాఖండాలను ఒకచోట చేర్చింది. ఈ సందర్భంగా విజిటర్స్, అతిథులు ప్రదర్శనలో ఉన్న కళాఖండాలను చూసి, వాటి ప్రత్యేకతల గురించి కళాకారులను అడిగి తెలుసుకున్నారు.
గ్రీన్, రెడ్ మరియు ఎల్లో కలర్స్ లో విలక్షణమైన రేఖాగణిత మోడల్స్ తో కూడిన అద్భుతమైన అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్లు ఈ ప్రదర్శనలోని హైలెట్ గా నిలుస్తున్నాయి. ఇలాంటి అనేక ఖతారీ వారసత్వ కళాఖండాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
డాక్టర్ అల్-సులైతి ఉన్నతాధికారులతో కలిసి ప్రదర్శనను తిలకించారు. ఖతార్ ప్రధాన సాంస్కృతిక గమ్యస్థానంగా కతారా కల్చరల్ విలేజ్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే ఉందని పేర్కొన్నారు. ఇది ఖతారీ అసోసియేషన్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ కు ఒక శాశ్వత వేదికను అందిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







