అప్పులు చెల్లించకుంటే.. మూడేళ్ల ట్రావెల్ బ్యాన్..!!
- April 14, 2026
మనామా: అప్పులు చెల్లించని వారిపై గరిష్టంగా మూడేళ్ల వరకు ప్రయాణ నిషేధాన్ని విధించేందుకు అనుమతించాలని ఐదుగురు ఎంపీలు ప్రతిపాదించారు. అప్పులు చెల్లించకుండా కొంతమంది వ్యక్తులు బహ్రెయిన్ విడిచి తప్పించుకుపోతున్నారని, అలాంటి వారిని నిరోధించడానికి ఎక్కువ కాలం ట్రావెల్ బ్యాన్ విధించడం ఒక్కటే పరిష్కారం అని తెలిపారు.
ఎంపీలు ఖాలిద్ బువానాఖ్, అహ్మద్ అల్ సల్లూమ్, డాక్టర్ అలీ అల్ నుఐమీ, జైనాబ్ అబ్దుల్ అమీర్ మరియు మహమూద్ ఫర్దాన్ స ఈ ప్రతిపాదన సమర్పించారు. ఈ ముసాయిదా ప్రకారం, కోర్టు ఒకేసారి గరిష్టంగా మూడు నెలల ప్రయాణ నిషేధాన్ని విధించవచ్చు. దీనిని పలుమార్లు పునరుద్ధరించే అవకాశం ఉంది. మొత్తంగా గరిష్టంగా మూడేళ్ల వరకు నిషేధం పొడిగించవచ్చు.
ఈ ప్రతిపాదన లోన్ రికవరీ యంత్రాంగాలను బలోపేతం చేయడానికి మరియు పెద్ద కేసులలో విచారణకు న్యాయస్థానాలకు తగినంత సమయం ఉండేలా చూడటానికి ఈ సవరణ ఉపయోగపడుతుందని ఎంపీలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







