దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- April 14, 2026
దోహా: దోహాలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జై భీమ్ యూత్ ఆధ్వర్యంలో, బాబు సికోలు అధ్యక్షతన భారత్ రెస్టారెంట్లో జరిగిన ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ వర్గాల తెలుగు ప్రజలు, ప్రముఖ అతిథులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం అందించడానికి కృషి చేసిన మహానుభావుడు, భారత రాజ్యాంగ నిర్మాతగా భావితరాలకు దిశానిర్దేశం చేసిన ప్రపంచ మేధావి అని సభలో పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్యంగా కృషి చేసిన జై భీమ్ యూత్ అధ్యక్షుడు బాబు సికోలుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే ఆర్గనైజింగ్ టీమ్ సభ్యులు వాసర్ల సురేష్, షేక్ షాన్, రాపాక సూర్య, మోహన్ మరియు ఇతర సభ్యుల సేవలను ప్రశంసించారు.
భారతదేశం నుండి కూడా ఈ వేడుకలకు విశేష మద్దతు లభించింది.డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు,ఎడ్ల తాతాజీ (ఆచంట నియోజకవర్గం పరిశీలకులు, మాజీ డీసీఎం చైర్మన్), పాలకొల్లు వైఎస్సార్సీపీ ఇంచార్జి పాముల రాజేశ్వరి దేవి ఫోన్ కాల్ ద్వారా స్పందించి వీడియో సందేశాలు పంపి తమ మద్దతును తెలిపారు.
కతార్లో ఉన్న అన్ని వర్గాల తెలుగు సోదరులు, ముఖ్య అతిథులు మరియు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “జై భీమ్” నినాదాలతో కార్యక్రమం ముగిసింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







