కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- April 14, 2026
కువైట్ సిటీ: జజీరా ఎయిర్వేస్కు కేటాయించిన టెర్మినల్ 5 (T5) కార్యకలాపాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభమవుతాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న వార్తలను కువైట్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు.
DGCA విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, T5 టెర్మినల్ పునఃప్రారంభంపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక నిర్ణయం తీసుకోలేదని, అలాగే ప్రభుత్వ అధికారిక వర్గాల నుంచి ఈ విషయంపై ఎలాంటి ప్రకటన వెలువడలేదని పేర్కొంది. విమానాశ్రయ టెర్మినళ్ల నిర్వహణ, విమాన సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించిన అన్ని నిర్ణయాలు కేవలం అధికారిక ఛానెళ్ల ద్వారానే ప్రకటించబడతాయని సంస్థ వివరించింది.
ఇక సోషల్ మీడియాలో ధృవీకరణ లేని సమాచారాన్ని నమ్మవద్దని, అలాంటి వార్తలను ఇతరులతో పంచుకోవద్దని DGCA ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సరైన సమాచారం కోసం అధికారిక మూలాలను మాత్రమే అనుసరించాలని సూచించింది.
ఈ నేపథ్యంలో, ప్రయాణికులు మరియు ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి









