దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు
- August 05, 2016
దుబాయ్: గురువారం ఉదయం దుబాయ్ లోని అల ముహాసనః 2 ప్రాంతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులను ఎక్కించుకువెళ్ళే ఒక వాహనం మరొక బస్సును ఢీకొట్టింది. పురుష మరియు మహిళా ఉద్యోగులని వారి వారి గమ్యస్థానాలకు , ఉద్యోగస్థానానికి రవాణా చేసే కంపెనీ బస్సు అని రవాణా జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ మరియు రెస్క్యూ మేజర్ జనరల్ పైలట్ అనాసాల్ మంత్రౌషి , అన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఎరుపు సంకేతం కోసం ఆపడానికి యత్నించిన డ్రైవర్ బ్రేకులు వేయడానికి ఎంతో ప్రయత్నించి విఫలమైన తర్వాత పికప్ హఠాత్తుగా ప్రారంభమై ట్రాఫిక్ రద్దీ మొదలైన నడిరోడ్డు మీదకు అడ్డంగా ప్రయాణించింది.ఇతర వైపు నుంచి మరో బస్సు వచ్చి వేగంగా డీ కొట్టడంతో ఒక మహిళ అక్కడకి అక్కడే మరణించగా, బస్సులో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వాహనం యొక్క నియంత్రణ కోల్పోవడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









