దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు
- August 05, 2016
దుబాయ్: గురువారం ఉదయం దుబాయ్ లోని అల ముహాసనః 2 ప్రాంతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులను ఎక్కించుకువెళ్ళే ఒక వాహనం మరొక బస్సును ఢీకొట్టింది. పురుష మరియు మహిళా ఉద్యోగులని వారి వారి గమ్యస్థానాలకు , ఉద్యోగస్థానానికి రవాణా చేసే కంపెనీ బస్సు అని రవాణా జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ మరియు రెస్క్యూ మేజర్ జనరల్ పైలట్ అనాసాల్ మంత్రౌషి , అన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఎరుపు సంకేతం కోసం ఆపడానికి యత్నించిన డ్రైవర్ బ్రేకులు వేయడానికి ఎంతో ప్రయత్నించి విఫలమైన తర్వాత పికప్ హఠాత్తుగా ప్రారంభమై ట్రాఫిక్ రద్దీ మొదలైన నడిరోడ్డు మీదకు అడ్డంగా ప్రయాణించింది.ఇతర వైపు నుంచి మరో బస్సు వచ్చి వేగంగా డీ కొట్టడంతో ఒక మహిళ అక్కడకి అక్కడే మరణించగా, బస్సులో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వాహనం యొక్క నియంత్రణ కోల్పోవడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







