దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు
- August 05, 2016
దుబాయ్: గురువారం ఉదయం దుబాయ్ లోని అల ముహాసనః 2 ప్రాంతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులను ఎక్కించుకువెళ్ళే ఒక వాహనం మరొక బస్సును ఢీకొట్టింది. పురుష మరియు మహిళా ఉద్యోగులని వారి వారి గమ్యస్థానాలకు , ఉద్యోగస్థానానికి రవాణా చేసే కంపెనీ బస్సు అని రవాణా జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ మరియు రెస్క్యూ మేజర్ జనరల్ పైలట్ అనాసాల్ మంత్రౌషి , అన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఎరుపు సంకేతం కోసం ఆపడానికి యత్నించిన డ్రైవర్ బ్రేకులు వేయడానికి ఎంతో ప్రయత్నించి విఫలమైన తర్వాత పికప్ హఠాత్తుగా ప్రారంభమై ట్రాఫిక్ రద్దీ మొదలైన నడిరోడ్డు మీదకు అడ్డంగా ప్రయాణించింది.ఇతర వైపు నుంచి మరో బస్సు వచ్చి వేగంగా డీ కొట్టడంతో ఒక మహిళ అక్కడకి అక్కడే మరణించగా, బస్సులో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వాహనం యొక్క నియంత్రణ కోల్పోవడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







