దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు
- August 05, 2016
దుబాయ్: గురువారం ఉదయం దుబాయ్ లోని అల ముహాసనః 2 ప్రాంతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులను ఎక్కించుకువెళ్ళే ఒక వాహనం మరొక బస్సును ఢీకొట్టింది. పురుష మరియు మహిళా ఉద్యోగులని వారి వారి గమ్యస్థానాలకు , ఉద్యోగస్థానానికి రవాణా చేసే కంపెనీ బస్సు అని రవాణా జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ మరియు రెస్క్యూ మేజర్ జనరల్ పైలట్ అనాసాల్ మంత్రౌషి , అన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఎరుపు సంకేతం కోసం ఆపడానికి యత్నించిన డ్రైవర్ బ్రేకులు వేయడానికి ఎంతో ప్రయత్నించి విఫలమైన తర్వాత పికప్ హఠాత్తుగా ప్రారంభమై ట్రాఫిక్ రద్దీ మొదలైన నడిరోడ్డు మీదకు అడ్డంగా ప్రయాణించింది.ఇతర వైపు నుంచి మరో బస్సు వచ్చి వేగంగా డీ కొట్టడంతో ఒక మహిళ అక్కడకి అక్కడే మరణించగా, బస్సులో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వాహనం యొక్క నియంత్రణ కోల్పోవడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









