దుబాయ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, 16 మందికి గాయాలు
- August 05, 2016దుబాయ్: గురువారం ఉదయం దుబాయ్ లోని అల ముహాసనః 2 ప్రాంతంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 16 మందికి గాయాలయ్యాయి. ప్రయాణికులను ఎక్కించుకువెళ్ళే ఒక వాహనం మరొక బస్సును ఢీకొట్టింది. పురుష మరియు మహిళా ఉద్యోగులని వారి వారి గమ్యస్థానాలకు , ఉద్యోగస్థానానికి రవాణా చేసే కంపెనీ బస్సు అని రవాణా జనరల్ డైరెక్టరేట్ డైరెక్టర్ మరియు రెస్క్యూ మేజర్ జనరల్ పైలట్ అనాసాల్ మంత్రౌషి , అన్నారు. ఉదయం 9.30 గంటల సమయంలో ఎరుపు సంకేతం కోసం ఆపడానికి యత్నించిన డ్రైవర్ బ్రేకులు వేయడానికి ఎంతో ప్రయత్నించి విఫలమైన తర్వాత పికప్ హఠాత్తుగా ప్రారంభమై ట్రాఫిక్ రద్దీ మొదలైన నడిరోడ్డు మీదకు అడ్డంగా ప్రయాణించింది.ఇతర వైపు నుంచి మరో బస్సు వచ్చి వేగంగా డీ కొట్టడంతో ఒక మహిళ అక్కడకి అక్కడే మరణించగా, బస్సులో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. రహదారిపై వాహనం యొక్క నియంత్రణ కోల్పోవడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు