ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన

- April 17, 2026 , by Maagulf
ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన

ఫుజైరా: యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ నేడు ఫుజైరా పాలకుడు, సుప్రీమ్ కౌన్సిల్ సభ్యుడు షేక్ హమద్ బిన్ మహ్మద్ అల్ షార్కీతో సమావేశమయ్యారు. దేశ అభివృద్ధి నేపథ్యంలో పలు జాతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

ఈ సందర్భంగా ప్రజల ఆశయాలు, సంక్షేమం దేశ నాయకత్వానికి ప్రధాన ప్రాధాన్యంగా ఉంటాయని, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో కూడా అవే కేంద్ర బిందువుగా నిలుస్తాయని వారు స్పష్టం చేశారు. యూఏఈ సమాజాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే విలువలు ఐక్యత, సమగ్రతను బలోపేతం చేసి సవాళ్లను ఎదుర్కొనే శక్తిని పెంచుతున్నాయని ప్రశంసించారు.

తరువాత అధ్యక్షుడు షేక్ మహ్మద్, షేక్ హమద్‌తో కలిసి ఫుజైరా పోర్ట్ను సందర్శించి అక్కడి కార్యకలాపాలను సమీక్షించారు. పోర్ట్‌లో వ్యాపార కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. అత్యున్నత స్థాయి సామర్థ్యంతో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా ఫుజైరా పోర్ట్ యూఏఈకు కీలక ఆస్తిగా నిలుస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌కు కూడా ముఖ్య కేంద్రంగా ఉన్నదని నేతలు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో యూఏఈ స్థాయిని బలోపేతం చేయడంలో ఈ పోర్ట్ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

ఈ పర్యటనలో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ షేక్ మహ్మద్ బిన్ హమద్ అల్ షార్కీ, ప్రెసిడెన్షియల్ కోర్టు ప్రతినిధులు, పలు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com