ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- April 18, 2026
దోహా: ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో, ఎంబసీ ఆఫ్ ఇండియా, దోహా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్లో విశేష సేవలందించిన తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధును భారత రాయబారి విపుల్ అభినందించారు.
ఇండియన్ కమ్యూనిటీ పిలుపు మేరకు ముందుకు వచ్చిన మధు, దాదాపు నెల రోజుల పాటు అహర్నిశలు సేవలు అందించారు. ఈ క్లిష్ట సమయంలో కార్మికులకు అవసరమైన సమాచారం, సహాయం, మార్గదర్శనం అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.
కష్టకాలంలో కార్మికుల పక్కన నిలబడి వారికి ధైర్యం చెప్పిన ఆయన సేవలు ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ సత్కారం ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా మాత్రమే కాకుండా, సమాజం కోసం నిరంతరం కృషి చేసే ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఖతర్లో భారతీయ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మైదం మధు సేవలు కమ్యూనిటీలో విశేష గుర్తింపు పొందాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







