ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- April 18, 2026
దోహా: ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో, ఎంబసీ ఆఫ్ ఇండియా, దోహా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్లో విశేష సేవలందించిన తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధును భారత రాయబారి విపుల్ అభినందించారు.
ఇండియన్ కమ్యూనిటీ పిలుపు మేరకు ముందుకు వచ్చిన మధు, దాదాపు నెల రోజుల పాటు అహర్నిశలు సేవలు అందించారు. ఈ క్లిష్ట సమయంలో కార్మికులకు అవసరమైన సమాచారం, సహాయం, మార్గదర్శనం అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.
కష్టకాలంలో కార్మికుల పక్కన నిలబడి వారికి ధైర్యం చెప్పిన ఆయన సేవలు ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ సత్కారం ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా మాత్రమే కాకుండా, సమాజం కోసం నిరంతరం కృషి చేసే ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఖతర్లో భారతీయ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మైదం మధు సేవలు కమ్యూనిటీలో విశేష గుర్తింపు పొందాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









