ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- April 18, 2026
దోహా: ఇటీవల నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితుల్లో, ఎంబసీ ఆఫ్ ఇండియా, దోహా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్లో విశేష సేవలందించిన తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధును భారత రాయబారి విపుల్ అభినందించారు.
ఇండియన్ కమ్యూనిటీ పిలుపు మేరకు ముందుకు వచ్చిన మధు, దాదాపు నెల రోజుల పాటు అహర్నిశలు సేవలు అందించారు. ఈ క్లిష్ట సమయంలో కార్మికులకు అవసరమైన సమాచారం, సహాయం, మార్గదర్శనం అందిస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.
కష్టకాలంలో కార్మికుల పక్కన నిలబడి వారికి ధైర్యం చెప్పిన ఆయన సేవలు ప్రశంసనీయమని అధికారులు పేర్కొన్నారు. ఈ సత్కారం ఆయన చేసిన సేవలకు గౌరవ సూచకంగా మాత్రమే కాకుండా, సమాజం కోసం నిరంతరం కృషి చేసే ప్రతి ఒక్కరికీ ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఖతర్లో భారతీయ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న మైదం మధు సేవలు కమ్యూనిటీలో విశేష గుర్తింపు పొందాయి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







