ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- April 20, 2026
కువైట్: వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై పర్యవేక్షణను కఠినతరం చేయాలని కువైట్ సెంట్రల్ బ్యాంక్ స్థానిక బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసింది.
చెల్లుబాటులో లేని పర్మిట్లు కలిగిన కార్మికుల సివిల్ ఐడి నంబర్లు మరియు పేర్లను బ్యాంకులకు అందించడానికి, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్తో ఒక ఆటోమేటెడ్ లింక్ను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
కస్టమర్ డేటాను క్రమం తప్పకుండా అప్డేట్ చేయడానికి మరియు డీయాక్టివేట్ ఖాతాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి బ్యాంకులకు సహాయపడటమే ఈ చర్య లక్ష్యమని పేర్కొన్నది.
కొన్ని బ్యాంకులకు గతంలో అటువంటి కస్టమర్ల గురించి తగినంత సమాచారం లేకపోవడం వల్ల, కొన్ని ఖాతాలు తెరిచి ఉండిపోయాయని.. ఇది ఫ్రాడ్ లేదా చట్టవిరుద్ధ లావాదేవీల ప్రమాదాలకు దారితీసిందని రెగ్యులేటర్ పేర్కొంది. బ్యాంకులు “నో యువర్ కస్టమర్” (KYC) అవసరాలను పాటించాలని మరియు ఈ ఖాతాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
దేశ ఆర్థిక రంగంలో మనీలాండరింగ్ నిరోధక మరియు ఉగ్రవాద నిధుల నిరోధక నియంత్రణలను పటిష్టం చేయడానికి జరుగుతున్న నిరంతర ప్రయత్నాలలో ఈ చర్యలు ఒక భాగమని సర్క్యులర్ లో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







