కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది

- July 23, 2015 , by Maagulf
కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది

మత్తుపదార్థాల అక్రమ రవాణాతో కువైట్ లో జైలు పాలైన భారతీయుల సంఖ్య పెరుగుతోంది. కువైట్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న వారిలో 60 శాతం మందిపైగా మత్తుపదార్థాల అక్రమ రవాణా కేసులతో సంబంధమున్నవారేనని ప్రభుత్వం గణంకాలు వెల్లడిస్తున్నాయి. డ్రగ్స్ తో పట్టుబడిన వారు తమ న్యాయవ్యవస్థ నుంచి తప్పించుకోలేరని తెలిపింది. ఇలాంటి కేసుల్లో అరెస్టైన వారి విషయంలో దౌత్య కార్యాలయాలు జోక్యం చేసుకునే వీలుండదని స్పష్టం చేసింది. కువైట్ చట్టాల ప్రకారం మత్తుపదార్థాల రవాణా కేసుల్లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు ఉంటాయి. మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. బెయిల్ కూడా దొరకదు. కువైట్ లో 8 లక్షల మందిపైగా భారతీయులు ఉన్నారు.                 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com