టాలీవుడ్‌లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత

- April 22, 2026 , by Maagulf
టాలీవుడ్‌లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత

హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, నిర్మాత, సినీ విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు (56) మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

చిట్టిబాబు అసలు పేరు త్రిపురనేని వరప్రసాద్. 1970 జనవరి 1న కృష్ణా జిల్లాలోని కాజ గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి త్రిపురనేని మహారథి తెలుగు సినీ రంగంలో ప్రముఖ రచయిత. ఎన్టీఆర్ నటించిన “అల్లూరి సీతారామరాజు” వంటి చిత్రాలకు ఆయన అందించిన సంభాషణలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.

తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ చిట్టిబాబు సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడిగా, సహాయ నటుడిగా అనేక చిత్రాల్లో నటించారు. అలాగే సినిమా నిర్మాణంపై ఆసక్తితో నిర్మాతగా కూడా పలు సినిమాలు తీశారు. సినిమాల వ్యాపారం, డిస్ట్రిబ్యూషన్ వంటి అంశాలపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.

ఇటీవలి కాలంలో చిట్టిబాబు ఒక సినీ విశ్లేషకుడిగా కూడా గుర్తింపు పొందారు. సినిమాల ట్రెండ్స్, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై టీవీ చర్చల్లో స్పష్టంగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com