కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- April 22, 2026
బెంగళూరు: బెంగళూరులో మానవత్వం మంటగలిసిపోయింది. ప్రేమించిన వాడు తనను పట్టించుకోవడం లేదనే కక్షతో ఒక యువతి అత్యంత కిరాతకానికి ఒడిగట్టింది. తన ప్రియుడిని ఇంటికి పిలిపించి, నమ్మించి, తాళ్లతో కట్టేసి సజీవ దహనం చేయడానికి ప్రయత్నించింది.
రాజాజీనగర్లోని టెలికాం స్టోర్లో పనిచేసే ప్రేరణ (27), కిరణ్ అనే యువకుడు గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల కిరణ్ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తనను పెళ్లి చేసుకోడని ప్రేరణ అనుమానం పెంచుకుంది.మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి కిరణ్ను అంజనపురలోని తన నివాసానికి పిలిపించింది. కొత్త స్టైల్లో ప్రపోజ్ చేస్తానని నమ్మించి, అతడి కళ్లకు గంతలు కట్టింది.కళ్లు కనిపించని స్థితిలో ఉన్న కిరణ్ను కుర్చీలో కూర్చోబెట్టి, తాళ్లతో కట్టేసింది. ఆపై ఏమాత్రం కనికరం లేకుండా అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. అతను కేకలు వేస్తున్నా ఏమాత్రం చలించని ఆమె ఆ దృశ్యాన్ని తాపీగా సెల్ఫోన్లో రికార్డు చేసింది.
దీంతో కుర్చీలోనే కిరణ్ సజీవదహనమయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగినప్పుడు తాను బాత్రూమ్లో ఉన్నానని, పొగ రావడంతో గమనించి బయటకు వచ్చేసరికి కిరణ్ కుర్చీలో కాలిపోయి ఉన్నాడని పోలీసులకు చెప్పింది. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పథకం ప్రకారమే ప్రేమ అతడిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు నార్త్వెస్ట్ డీసీపీ డీఎల్ నగేష్ వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









