పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- April 27, 2026
మచిలీపట్టణం: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఏర్పడిన తాత్కాలిక ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ఛైర్మన్ అరవిందర్ సింగ్ షాని, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL) ఛైర్మన్ సంజయ్ ఖన్నా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (HPCL) ఛైర్మన్ వికాస్ కౌశల్లతో తాను నేరుగా మాట్లాడినట్లు తెలిపారు. సరఫరా వ్యవస్థను వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నందున ఈరోజు, రేపటిలో పెట్రోల్, డీజిల్ సరఫరా గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడిన అనంతరం పరిస్థితి సుమారు 90 శాతం వరకు పరిష్కారమైందని సమాచారం అందిందని బాలశౌరి తెలిపారు. రేపటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చి సాధారణ సరఫరా పునరుద్ధరించబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రైవేట్ మరియు మైనింగ్ ఆపరేటర్లు కమర్షియల్ అవుట్లెట్లకు బదులుగా రిటైల్ అవుట్లెట్ల నుంచి ఇంధనం పొందడం వల్ల ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరించారు. దీనిని నివారించేందుకు ప్రభుత్వం వాహనాలకు నిర్దిష్ట పరిమితులు విధించి సరఫరాను క్రమబద్ధీకరించడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందన్నారు.
అనవసర ఆందోళనలు, అపోహలకు లోనుకాకుండా ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరియు ఆయిల్ సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, త్వరలోనే పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







