తెలుగమ్మాయి రుత్విక శివాని సత్తా చాటింది..
- August 07, 2016
వీవీ నాథూ మెమోరియల్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో తెలుగమ్మాయి రుత్విక శివాని సత్తా చాటింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రుత్విక 21-18, 21-6తో తులసిపై గెలుపొంది టైటిల్ను దక్కించుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ ఫైనల్లో గురుసాయిదత్ 12-21, 21-17, 14-21తో సౌరభ్ వర్మ చేతిలో ఓడిపోయి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు.మహిళల డబుల్స్ ఫైనల్లో సిక్కిరెడ్డి- మనీషా జంట 13-21, 21-18, 21-9తో అపమా బాలన్-ప్రజక్త సావంత్ జోడిని ఓడించగా, పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ శెట్టి జంట 21-16, 21-18తో అర్జున్-శ్లోక్ రామచంద్రన్ జోడిపై గెలుపొందింది. మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయి-మనీషా జంట 18-21, 26-24, 21-14తో జిష్ణు-ప్రజక్త సావంత్ జోడిని ఓడించి టైటిల్ను దక్కించుకుంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







