ఉచిత ప్రవేశాన్ని ప్రకటించిన ఖతార్ మ్యూజియమ్స్..!!
- May 15, 2026
దోహా: అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలలోకి ఉచిత ప్రవేశాన్ని ఖతార్ మ్యూజియంలు ప్రకటించాయి. మే 18న అన్ని వయసుల వారికి ప్రవేశం ఉచితమని తెలిపింది. ఈ సంవత్సరం వేడుకలను “విడిపోయిన ప్రపంచాన్ని ఏకం చేసే మ్యూజియంలు” అనే థీమ్తో నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
ఖతార్ జాతీయ మ్యూజియం 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో కళ, సంస్కృతి, కథల ద్వారా ప్రజలను ఏకం చేయడంలో మ్యూజియంలు ప్రముఖ పాత్రను పోషిస్తాయని అన్నారు. సృజనాత్మకత మరియు సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో మ్యూజియంలు పోషించే సాంస్కృతిక మరియు విద్యాపరమైన పాత్రను ప్రముఖంగా చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







