న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- May 15, 2026
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ సమావేశమై దేశ, రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగ అభివృద్ధి, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై పరస్పర చర్చ జరిగినట్లు సమాచారం.
ఇక కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా గవర్నర్ సమావేశమయ్యారు. యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది.
ఈ సమావేశాలు మర్యాదపూర్వకంగానే జరిగినప్పటికీ, పలు ప్రాధాన్య అంశాలపై అభిప్రాయాల మార్పిడి జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!







