న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ

- May 15, 2026 , by Maagulf
న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ సమావేశమై దేశ, రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగ అభివృద్ధి, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై పరస్పర చర్చ జరిగినట్లు సమాచారం.

ఇక కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా గవర్నర్ సమావేశమయ్యారు. యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది.

ఈ సమావేశాలు మర్యాదపూర్వకంగానే జరిగినప్పటికీ, పలు ప్రాధాన్య అంశాలపై అభిప్రాయాల మార్పిడి జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com