న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- May 15, 2026
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ సమావేశమై దేశ, రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగ అభివృద్ధి, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై పరస్పర చర్చ జరిగినట్లు సమాచారం.
ఇక కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా గవర్నర్ సమావేశమయ్యారు. యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది.
ఈ సమావేశాలు మర్యాదపూర్వకంగానే జరిగినప్పటికీ, పలు ప్రాధాన్య అంశాలపై అభిప్రాయాల మార్పిడి జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..







