న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- May 15, 2026
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా న్యూఢిల్లీ పర్యటన సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ సమావేశమై దేశ, రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక రంగ అభివృద్ధి, రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక అంశాలపై పరస్పర చర్చ జరిగినట్లు సమాచారం.
ఇక కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాతో కూడా గవర్నర్ సమావేశమయ్యారు. యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలిసింది.
ఈ సమావేశాలు మర్యాదపూర్వకంగానే జరిగినప్పటికీ, పలు ప్రాధాన్య అంశాలపై అభిప్రాయాల మార్పిడి జరిగినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
- జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పై సీఎం రేవంత్ స్పష్టత
- యూఏఈ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ నెథర్లాండ్స్ కు ప్రయాణం..
- భారత్–యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు, పెట్టుబడులకు శ్రీకారం
- యూఏఈ–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం పై యూఏఈ అధ్యక్షుడు, ప్రధాని మోదీ
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక కంటి వైద్య కేంద్రం ప్రారంభం
- స్ఫియర్ అబుదాబి అంటే ఏమిటి? డిజిటల్ కాన్వాస్గా యాస్ ఐలాండ్..!!









