NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- May 15, 2026
ముంబై: భారత దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్- యూజీ(NEET UG) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన సూత్రధారి పీవీ కులకర్ణి అరెస్టయ్యాడు. రసాయన శాస్త్రంలో లెక్చరర్ అయిన ఆయనను పుణేలో శుక్రవారం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాతీయ పరీక్ష సంస్థ తరఫున ప్రశ్నపత్రాలు రూపొందించే బృందలో ఒకడైన కులకర్ణి.. మే 3న జరిగిన నీట్ పేపర్ను లీక్ చేశాడు. ప్రైవేట్ ట్యూషన్ల సమయంలోనే కులకర్ణి నీట్ పేపర్ను లీక్ చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ – యూజీ ప్రశ్నాపత్రం లీకేజీలో కీలకమైన పీవీ కులకర్ణి పోలీసులకు చిక్కాడు. లీకేజీకి సూత్రధారి అయిన కులకర్ణిని శుక్రవారం పుణేలో సీబీఐ బృందం అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్ చివరి వారంలో కులకర్ణి మరో నిందితుడు మనీశా వాఘ్మరే సాయంతో తన ఇంట్లో కొందరు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాడు. ఈ సమయంలోనే ఆయన నీట్ పేపర్ను లీక్ చేశాడని, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం వారికి చెప్పగా..వారు నోటు చేసుకున్నారని సీబీఐ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రమాదకర డ్రైవింగ్కు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు
- సైబర్ నేరాల నిర్మూలనకు 90 రోజుల యాక్షన్ ప్లాన్: ఏపీ డీజీపీ..
- సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్నారై తెలుగుదేశం మహానాడు
- యూఏఈలో ఇళ్లు, వాహనాలు, కార్గోకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ విస్తరణ
- ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- NEET లీకేజీ సూత్రధారి అరెస్ట్.. పుణేలో అదుపులోకి తీసుకున్న సీబీఐ..!
- విద్యార్థుల భద్రత కోసం ‘సురక్ష కవచ్’ హ్యాండ్బుక్ ఆవిష్కరణ
- న్యూఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా భేటీ
- పుట్టపర్తిలో మూడు కీలక డిఫెన్స్ ప్రాజెక్టులకు శంకుస్థాపన
- జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ పై సీఎం రేవంత్ స్పష్టత









