ఎపి సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలం నవంబరు 30 వరకు పొడిగింపు
- May 15, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30 వరకు పొడింగించింది.రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్ర ప్రభుత్వం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈమేరకు ఆల్ ఇండియా సర్వీసెస్(AIS) రూల్ 16(1)(DCRB)రూల్స్ 1958 కు అనుగుణంగా సిఎస్ సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలకు పొడిగిస్తూ కేంద్ర డిపార్టుమెంట్ ఆఫ్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్(డిఓపిటి)మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరి రాజేశ్ కుమార్ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శికి లేఖ ద్వారా తెలియ జేశారు.ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న సాయి ప్రసాద్ వాస్తవానికి ఈనెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సిఎస్ పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ఆమేరకు కేంద్ర ప్రభుత్వం సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని ఆరు మాసాలు అనగా జూన్ 1 నుండి నవంబరు 30వ తేదీ వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..







