ముల్తానీతో నల్ల మచ్చలకు ట్రీట్మెంట్
- July 24, 2015
ముల్తానీ మట్టికి ముఖం మీద ఉన్న జిడ్డుని, మృత కణాలను తొలగించే లక్షణం ఉంటుంది. ముల్తానీ మట్టికి, నిమ్మరసం కలిపి వేసిన ప్యాక్ ముఖం మీద ఉన్న హానకారక బాక్టీరియాని చంపి, మొటిమలు రానివ్వకుండా చేస్తుంది. రోజ్ వాటర్తో కలిపిన మిశ్రమం ముఖానికి మంచి మెరుపునిస్తుంది. పాలతో కలిపిన ముల్తానీ మిశ్రమం ముఖాన్ని పొడిబారనీయకుండా చేసి తాజాగా ఉంచుతుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా పుదీనా ఆకుల మిశ్రమం, పెరుగూ కలిపి ముఖానికి ప్యాక్లా వేసి అరగంటయ్యాక కడిగేస్తే ముఖం మీద నల్లమచ్చలు తగ్గుతాయి. ముల్తానీ మట్టికి కొద్దిగా గంధం, పసుపు కొద్దిగా పాలు పోసి మెత్తని పేస్ట్లా చేసి వేళ్లలోకి తీసుకుని ముఖంపై వలయాకారంగా సున్నితంగా మర్ధన చేయడం వల్ల ముఖం మీద వచ్చే ముడతలు తగ్గి ముఖం కాంతి వంతంగా తాజాగా కనిపిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









