కాబూల్ లో మరోసారి విదేశీయులు కిడ్నాప్కు గురయ్యారు..
- August 08, 2016
ఆఫ్ఘనిస్థాన్లోని కాబూల్ నగరంలో ఓ అమెరికన్ వ్యక్తిని, ఓ ఆస్ట్రేలియన్ను తుపాకీతో బెదిరించి కిడ్నాప్ చేశారు. తరచూ విదేశీయులను అపహరిస్తున్న ఈ ప్రాంతంలో మరోసారి విదేశీయులు కిడ్నాప్కు గురయ్యారు. ఆఫ్ఘనిస్థాన్లోని అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వీరిద్దరినీ నిన్న దుండగులు అపహరించినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. అయితే ఘటనకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చెయ్యలేదు. దార్-ఉల్-అమన్ రోడ్డుపై తుపాకీతో బెదిరించి కిడ్నాప్లు చేసే ముఠా ఇద్దరు విదేశీయులను అపహరించిందని సెక్యురిటీ అధికారి స్పష్టంచేశారు.ఆఫ్ఘనిస్థాన్లో కిడ్నాప్కు గురైన భారతీయ మహిళ జుడిత్ డిసౌజాను కాపాడిన రెండు వారాల అనంతరం మరోసారి కిడ్నాప్లు జరిగాయి. అమెరికన్ దేశస్థుడు కాబూల్లో కిడ్నాపైనట్లు తెలిసిందని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. కానీ ఈ అంశంపై వివరంగా స్పందించలేదు. ఆస్ట్రేలియా కూడా తమ పౌరుడు కిడ్నాపైనట్లు అక్కడి ఆస్ట్రేలియా రాయబార కార్యాలయం ద్వారా తెలిసిందని వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ అంశంపై ఎక్కువగా స్పందించడానికి నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మధ్యకాలంలో ఆఫ్ఘనిస్థాన్లో విదేశీయుల కిడ్నాప్లు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే..
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







