బావిలో పడి కార్మికుని దుర్మరణం

- August 08, 2016 , by Maagulf
బావిలో పడి కార్మికుని దుర్మరణం

జెడ : పూర్తిగా నీటితో నిండిన బావిలో  పడిన  ఓ ప్రవాస కార్మికుడు మరణించాడు. పోలీసులు ఈ సంఘటన గూర్చి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు. తైప్ లోని  ఒక వ్యవసాయ క్షేత్రం  వద్ద విధుల్లో ఉన్నకార్మికుడు అదుపు తప్పి 10 మీటర్ల లోతు ఉన్న బావిలో కిందకు  పడిపోయినట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు సమాచారం అందింది. పౌర రక్షణ అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి ఆ  కార్మికుడిని రక్షించే యత్నముల్  చేసినప్పటికీ , ఆ కార్మికుడిని అతి కష్టం మీద  బయటకు తీసుకువచ్చినప్పటకీ అప్పటికే ఆ కార్మికుడు మరణించినట్లు తెలిపారు.పది మీటర్ల లోతున్న ఈ బావిలో సగంకు పైగా  నీటితో నిండి ఉన్నట్లు స్థానికులు  తెలిపారు .     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com