రాష్ట్రపతితో జగన్ భేటీ
- August 08, 2016
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. సోమవారం సాయంత్రం పార్టీ ఎంపీలతో కలసి వైఎస్ జగన్.. రాష్ట్రపతి భవన్ లో ప్రణబ్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఇటీవల కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో వైఎస్ జగన్ రాష్ట్ర విషయాలను రాష్ట్రపతికి వివరించారు.ఈ రోజు ఉదయం వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుకు మద్దతు ఇస్తున్న జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టగా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







