పాసెంజర్లకు చుక్కలు చూపించిన డెల్టా
- August 08, 2016
డెల్టా ఎయిర్లైన్స్ సంస్థ సోమవారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంపెనీ కంప్యూటర్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆ సంస్థకు చెందిన విమానాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో డెల్టా విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఎక్కడికక్కడ కార్యకలాపాలు నిలిచిపోవడంతో డెల్టా ఎయిర్లైన్స్ ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకొని అవస్థలు పడ్డారు.అమెరికా అంతటా ఉన్న విమానాశ్రయాలతోపాటు, లండన్లోని విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రయాణికులు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విమానాలు ఆగిపోయి తాము పడుతున్న అవస్థలు ట్విట్టర్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. మరోవైపు డెల్టా కంపెనీ తన ట్విట్టర్ పేజీలో వివరణ ఇచ్చింది. తమ కంపెనీ సిస్టమ్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాలు ఆగిపోయాయని, త్వరలోనే ఈ సమస్య సమసిపోతుందని భావిస్తున్నామని ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







