ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- May 24, 2026
కువైట్ః ఈద్ అల్ అదా నేపథ్యంలో వినియోగదారులు కేవలం ఆమోదిత స్లాటర్ హౌజులు మాత్రమే ఉపయోగించాలని జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నియంత్రణ మరియు తనిఖీ విభాగంలోని స్లాటర్ హౌజ్ విభాగం డైరెక్టర్ మహమ్మద్ అల్-సలేం పిలుపునిచ్చారు. ఆమోదించబడిన ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో జహ్రా, ఫర్వానియా మరియు అహ్మది గవర్నరేట్లలోని కేంద్ర స్లాటర్ హౌజులను తమ ప్రాధికార సంస్థ పర్యవేక్షిస్తుందని అల్-సలేం తెలిపారు.
నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను పాటించేందుకు, తమ సంస్థ పర్యవేక్షణ మరియు అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోందని ఆయన తెలిపారు. ప్రజారోగ్యంపై ప్రభావం చూపే వ్యాధులు పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వధకు ముందు మరియు తర్వాత క్షుణ్ణమైన పశువైద్య తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వధ వాతావరణాన్ని కల్పించడానికి, అలాగే అత్యున్నత భద్రత మరియు నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా తగినంత పరిమాణంలో మాంసం సరఫరా అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని అల్-సలేం వివరించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







