ఈద్ నేపథ్యంలో కువైట్ ఫుడ్ అథారిటీ వార్నింగ్..!!
- May 24, 2026
కువైట్ః ఈద్ అల్ అదా నేపథ్యంలో వినియోగదారులు కేవలం ఆమోదిత స్లాటర్ హౌజులు మాత్రమే ఉపయోగించాలని జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ నియంత్రణ మరియు తనిఖీ విభాగంలోని స్లాటర్ హౌజ్ విభాగం డైరెక్టర్ మహమ్మద్ అల్-సలేం పిలుపునిచ్చారు. ఆమోదించబడిన ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో జహ్రా, ఫర్వానియా మరియు అహ్మది గవర్నరేట్లలోని కేంద్ర స్లాటర్ హౌజులను తమ ప్రాధికార సంస్థ పర్యవేక్షిస్తుందని అల్-సలేం తెలిపారు.
నాణ్యత మరియు భద్రతా ప్రమాణాలను పాటించేందుకు, తమ సంస్థ పర్యవేక్షణ మరియు అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తోందని ఆయన తెలిపారు. ప్రజారోగ్యంపై ప్రభావం చూపే వ్యాధులు పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని, వధకు ముందు మరియు తర్వాత క్షుణ్ణమైన పశువైద్య తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వధ వాతావరణాన్ని కల్పించడానికి, అలాగే అత్యున్నత భద్రత మరియు నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా తగినంత పరిమాణంలో మాంసం సరఫరా అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని అల్-సలేం వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







