ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- May 25, 2026
ఫుజైరా: ఈద్ అల్ అధా పర్వదినాన్ని పురస్కరించుకుని ఫుజైరా రూలర్, సుప్రీం కౌన్సిల్ సభ్యుడు హిజ్ హైనెస్ షేక్ హమద్ బిన్ మహమ్మద్ అల్ షర్కీ 104 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు. ఫుజైరాలోని శిక్షా, సంస్కరణ కేంద్రాల్లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని ఆయన ఆదేశించారు.
వివిధ దేశాలకు చెందిన ఈ ఖైదీలను వారి మంచి ప్రవర్తన, క్రమశిక్షణ ఆధారంగా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఖైదీలు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అవకాశం కల్పించడం, వారి కుటుంబాల్లో ఆనందాన్ని నింపడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఫుజైరా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ మహమ్మద్ అహ్మద్ బిన్ ఘనిమ్ అల్ కాబీ ఈ సందర్భంగా షేక్ హమద్కు కృతజ్ఞతలు తెలిపారు. విడుదలైన ఖైదీలు సమాజంలో సానుకూల పాత్ర పోషిస్తూ మంచి పౌరులుగా మారాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









