వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- May 26, 2026
మనామాః 77 ఏళ్ల బంగ్లాదేశ్ కార్మికుడు నాల్గవ అంతస్తు పైకప్పు నుండి పడి మరణించిన ఘటనలో సస్పెండ్ అయిన కార్మిక సూపర్వైజర్కు న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. నిర్లక్ష్యం మరియు వృత్తిపరమైన భద్రతా అవసరాలను పాటించడంలో వైఫల్యం కారణంగా కార్మికుడి మరణానికి కారణమైన సూపర్వైజర్ను ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ దోషిగా నిర్ధారించింది.
ఒక వెల్డింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ కంపెనీలో పనిచేసిన బాధితుడు, పని పూర్తి చేసిన తర్వాత రెస్టారెంట్ పైకప్పు నుండి సామగ్రిని తీసే క్రమంలో అతను బ్యాలెన్స్ కోల్పోయి 20 మీటర్ల ఎత్తు నుండి కింద పడిపోయాడు. తలకు, మెదడుకు బలమైన గాయాలు తగిలి ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోయాడని అధికారులు తెలిపారు.ఈ సంఘటనను సైట్లోని అసురక్షిత పరిస్థితుల కారణంగా జరిగిన ప్రమాదంగా లేబర్ మినిస్ట్రీ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ నివేదిక వర్గీకరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







