ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- May 26, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ‘ఏపీ ఎడ్సెట్-2026’ ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను తాడేపల్లిలో విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాలలో రికార్డు స్థాయిలో మొత్తం 99.3 శాతం మంది అభ్యర్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అభ్యర్థులు తమ ఫలితాలతో పాటు ర్యాంక్ కార్డులను కూడా అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
ర్యాంక్ కార్డుల డౌన్లోడ్ ఇలా

పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) కి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలను నమోదు చేసి ర్యాంక్ కార్డులను పొందవచ్చు. ఈ ర్యాంక్ కార్డులు త్వరలో ప్రారంభం కానున్న కౌన్సెలింగ్ ప్రక్రియకు మరియు కాలేజీల సీట్ల కేటాయింపునకు అత్యంత కీలకం కానున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







