ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!

- May 26, 2026 , by Maagulf
ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!

మస్కట్: ఈద్ అల్-అధా సందర్భంగా వివిధ కేసులలో శిక్షపడిన పలువురు జైలు ఖైదీలకు ఒమన్ సుప్రీం కమాండర్, హిజ్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ క్షమాభిక్ష ప్రసాదించారు. 

ఒమాన్ పౌరులు మరియు విదేశీయులతో సహా 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.

ఈ క్షమాభిక్ష హిజ్ మెజెస్టీ మానవతా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుందని, ఈద్ అల్-అధా వేడుకల సమయంలో ఖైదీల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని క్షమాభిక్ష ప్రసాదించినట్లు పేర్కొన్నారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com