మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- May 27, 2026
మనామా: ఈద్ అల్-అధా సందడితో మనామా సూక్లో కొనుగోలుదారుల సందడి పెరిగింది. ఇటీవల మార్కెట్కు వచ్చే వారి సంఖ్య పెరగడం, కొనుగోలుదారుల ఆసక్తితో మార్కెట్ తిరిగి జీవం పోసుకుందని పలువురు వ్యాపారులు పేర్కొన్నారు.
సాంప్రదాయకంగా ఈద్ సీజన్ అమ్మకాలకు అత్యంత కీలకమైన సమయమని బంగారు వ్యాపారి జయ్ రాథోడ్ తెలిపారు. ఈ ఏడాది కూడా వినియోగదారుల సంఖ్యలో స్పష్టమైన పెరుగుదల ఉందని తెలిపారు. ముఖ్యంగా ప్రాంతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు తిరిగి రావడం కూడా వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడటానికి దోహదపడుతోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో బంగారం దరలు కాస్తా తగ్గడం కూడా కలిసి వచ్చిందన్నారు.
సాధారణంగా బహ్రెయిన్ బంగారు డిజైన్లను కోరుకునే కువైట్ మరియు ఖతార్ వంటి పొరుగు దేశాల నుండి వచ్చే కస్టమర్ల తాకిడి మితంగానే ఉందని, అయితే ఈద్ సమయంలో వారి సంఖ్య క్రమంగా పెరిగిందని మరో నగల వ్యాపారి కునాల్ రమేష్ తెలిపారు.
మొత్తం మీద ప్రస్తుత ఈద్ కాలాన్ని మనామా సూక్కు స్వాగతించదగిన ప్రోత్సాహంగా వ్యాపారులు అభివర్ణిస్తున్నారు. ఈద్ పండుగ కొత్త ఉత్సాహాన్ని, బలమైన అమ్మకాలను మరియు బంగారు మార్కెట్కు సానుకూల దృక్పథాన్ని తీసుకువచ్చిందని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!
- ఈద్ అల్ అదా వేడుకలకు కొత్త వెలుగులు నింపిన నవజాత శిశువులు..!!
- తెలంగాణలో 3 రోజులు రెడ్ అలర్ట్
- సరికొత్త డిజిటల్ హంగులతో ‘మహానాడు 2026’ జెండా ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు!
- శ్రీలంక వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్
- డ్రైవింగ్ చేస్తూ ఈద్ శుభాకాంక్షలు పంపొద్దు: అబుదాబి పోలీసుల హెచ్చరిక









